Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మన భవిష్యత్తుతోపాటు సమాజ భవిష్యత్తుకు బాటలు వేద్దాం చేతులు కలపండి

మన సమస్యల పరిష్కారంతోపాటు సమాజ సేవ చేద్దాం
ఉపాధ్యాయులకు పట్టభద్రులకు సిపిఐ పార్టీ పిలుపు

విశాలాంధ్ర ..తనకల్లు మన సమస్యలను పరిష్కరించడంతోపాటు సమాజానికి సేవ చేద్దాం చేతులు కలపండని మండల పరిధిలోని బాలసముద్రం సిజి ప్రాజెక్ట్ రెడ్డివారి పల్లి తదితర ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలో,ఓటు హక్కు కలిగిన పట్టభద్రులను సిపిఐ మండల సమితి శుక్రవారం కోరారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి,పట్టబద్రుల ఎమ్మెల్సీ పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఉపాధ్యాయులు సైతం తమ హక్కులు కాపాడుకోవడానికి అభ్యర్థనలు చేస్తున్నారని ఇచ్చిన హామీలు సిపిఎస్ రద్దు కాలేదు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగులర్ చేయలేదు. సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ నడుంబించాలన్నారు. కనీస వేతనం ఉద్యోగాల భర్తీ ఇటువంటి విషయాలపై ఉసేత్తలేదన్నారు. సిపిఐ మండల కన్వీనర్ రెడ్డప్ప రైతు సంఘం అధ్యక్షుడు చౌడప్ప యాదవ్ సహాయ కార్యదర్శి కరీముల్లా రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సభ్యులు రవీంద్ర నాయక్ తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img