Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మహా శివరాత్రి సందర్భంగా నిత్య అన్నదానం…

విశాలాంధ్ర-గుంతకల్లు : పుణ్యక్షేత్రమైన కసాపురంలో నూతనంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నిర్మాణంలో భాగంగా శనివారం మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా టిపిఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తలారి పరుశురాముడు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు గుంతకల్ ఆర్డీవో రవీంద్రబాబు చేతుల మీదుగా భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవీంద్ర మాట్లాడుతూ టిపిఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మానవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నూతన ఆలయ నిర్మాణానికి మాధవ సేవ చేస్తున్నాడు అన్నారు నిత్య అన్నదాన సేవా కార్యక్రమం చేపట్టడం చాలా సాహసోపేతం అన్నారు.ఈ సందర్భంగా తలారి పరశురాముడు మాట్లాడుతూ పవిత్ర పుణ్యకార్యాలలో ఎవరైనా దాతలు సేవా గుణంతో ముందుకొచ్చే వారికి శాశ్వత నిత్య అన్నదాన సేవలో 50వేల 116 ఒక సంవత్సరం 25 వేల 116 రూపాయలు నాలుగు శనివారాలు నిత్య అన్నదాన సేవలకు పదివేల 116 రూపాయలు ఒక్కరోజు ఇచ్చే అన్నదాన సేవకు 5 వేల 116 ఒక్క పూట నిత్య అన్నదాన 1116 నిత్య సేవలో భాగస్వాములు కావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో లాయర్ గురు ప్రసాద్, ఆడిటర్ అక్షయ్, తలారి శకుంతలమ్మ, రామ్ చరణ్ తేజ్, మల్లికార్జున స్వామి, సత్య, ఇంజనీర్ రాజశేఖర్, ఆటో రాము, సరోజ, వాణి, శివరత్న, రాము, రవి, హనుమప్ప ,నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img