Friday, April 19, 2024
Friday, April 19, 2024

మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్న డిఈ ఫై చర్యలు తీసుకోవాలి..

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బి.సురేష్…

విశాలాంధ్ర-గుంతకల్లు : మున్సిపాలిటీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిపై డిఈ హేమచంద్ర లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బి.సురేష్ బుధవారం మున్సిపల్ ఎం ఈ విశ్వనాథ్ కి వినతిపత్రాన్ని సమర్పించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బి సురేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఇంజనీర్ సెక్షన్ లో డి ఈ గా విధులు నిర్వహిస్తున్న హేమచంద్ర కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు సచివాలయం వార్డుల మహిళా ఉద్యోగులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తూ తన వికృత చేష్టలతో మహిళా ఉద్యోగులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాడని ఇలాంటి నీచుడు దుర్మార్గుడు అయినా హేమచంద్ర పై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి చిన్న ,పి ఓ డబ్ల్యు నియోజవర్గం కార్యదర్శి ఆశాబి, ఐ ఎఫ్ టి యు నియోజవర్గం అధ్యక్షులు శ్రీరాములు, పట్టణ పేదల సంఘం అధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి జిలాన్, సభ్యులు రఘునాథ్ రెడ్డి, సత్తార్, గోపి, షేక్షావలి ,భాష ,జానయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img