Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మాజీ ఆర్మీ ఉద్యోగి.. మున్సిపల్ కార్యాలయముకు పనిముట్లు పంపిణీ

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని రాంనగర్ కు చెందిన మాజీ ఆర్మీ, అమర్ ఎలక్ట్రికల్ జాకార్డ్-లోకేష్ గంగా పవర్లూమ్స్ అధినేత టి. సతీష్ బుధవారం పురపాలక సంఘ కార్యాలయంలోని కమిషనర్ మల్లికార్జున కు 25 వేల రూపాయలు విలువచేసే యంత్ర పనిముట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు ఈ పనిముట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఉద్యోగులు దాతకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు ఈ ఈ.. సత్యనారాయణ, డి ఈ. వన్నూరప్ప, ఏఈలు హరీష్ ప్రతాప్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img