Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సుడిగాలి పర్యటన

బాధితులకు ఆర్థిక సహాయం అందవేత
విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ గురువారం నియోజకవర్గంలోని పలు మండలాలలో పర్యటిస్తూ బాధితులకు తగిన నగదును అందజేస్తూ ఆదుకున్నారు. ఇందులో భాగంగా బత్తలపల్లి లో ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో మరణించిన కుటుంబాలను, వివిధ ఆరోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలను కూడా వారు పరామర్శిస్తూ ఆర్థిక భరోసాను కల్పించారు. బత్తలపల్లి మండలం పో ట్లమర్రి గ్రామానికి చెందిన బత్తల మల్లేష్, గోట్లురు చెందిన దాసరి ఈశ్వరయ్య, ధర్మవరం లోని శాంతినగర్ లో గల హాజీ పీర, పట్టణంలోని దిమ్మెల సెంటర్ కు చెందిన గాలి నారాయణస్వామి, పట్టణంలోని 27వ వార్డుకు చెందిన ఆటో డ్రైవర్ నరసింహులు, రాజేంద్రనగర్ కు చెందిన ఫయాజ్ కుటుంబాలకు ఒక్కొక్క కి 25వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. రాజేంద్రనగర్ ఫయాజ్ కుమార్తె గాయాలతో చికిత్స పొందుతున్న ఆ కుటుంబానికి అదనంగా వైద్య ఖర్చుల నిమిత్తం మరో 25 వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించి భరోసాను కల్పించారు. పొట్ల మర్రి గ్రామానికి చెందిన ఆదిమూర్తి, కాటమయ్య గుండెపోటుతో మృతి చెందగా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. అదేవిధంగా పట్టణములోని శాంతినగర్కు చెందిన బజ్జీలు అమ్ముకునే పేద కుటుంబం అయిన తలారి లింగమ్మ ఇంటి ప్రహారా గోడను ఇటీవలే వైఎస్ఆర్సిపి నాయకులు అక్రమంగా కూల్చడంతో వారి ఇంటి కూడా వెళ్లి ధైర్యమును చెప్పి 25 వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని వారు అందజేస్తూ కుటుంబానికి అండగా ఉంటానని వారు భరోసా కల్పించారు. మృతి చెందిన కుటుంబాలో వారి చిత్రపటాలకు పూలు వేసి ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరిగింది. తదుపరి బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామ పెద్దమనిషి గోనుగుంట్ల మాధవయ్య ఆకస్మిక మృతి చెందడంతో అక్కడికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అదేవిధంగా బత్తలపల్లి మండలం వెంకట గారి పల్లి కి చెందిన గుండె ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకొనుచుండగా, అక్కడికి వెళ్లి పరామర్శించి ధైర్యాన్ని నింపారు. ముదిగుబ్బ మండలం నల్లాయకుంటపల్లి గ్రామానికి చెందిన గాలి నారాయణస్వామి కుటుంబ సభ్యులకు కూడా 25వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆటో ప్రమాదంలో మరణించిన ఆరుగురికి ఒకరు గాయాలైన వారికి కలిపి ఒక లక్ష 75 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడంతో బాధితులు గోనుగుంట్ల సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డిష్ రాజు, మాజీ వైస్ చైర్మన్ శీన, దుశా కృష్ణ, నబి రసూల్, సయ్యద్ బాబా, మల్లేనిపల్లి రాజు, బత్తలపల్లి ,తాడిమర్రి, ముదిగుబ్బ పార్టీ కన్వీనర్లు వీర నారప్ప, నారాయణస్వామి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img