విశాలాంధ్ర`ఉరవకొండ : దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన త్యాగాలు,సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు ఆమె 115 వ జన్మదినాలు పురస్కరించుకుని ఉరవకొండలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సోనియా శీనా, పార్టీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, చెన్నప్ప, ఓబులేసు గోపాల్ రెడ్డి, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.