Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మాజీ సీఎం చంద్రబాబు పై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ లో తెదేపా కార్యాలయం లో శనివారం తెలుగుదేశం పార్టీ రాష్ర్ట కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ పాత్రికేయులతో మాట్లాడుతూఎర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ రౌడీమూకల దాడి పిరికిపంద చర్యే.ఆంధ్రప్రదేశ్‍లో శాంతిభద్రతలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తీగా విఫలమైంది. రాజకీయంగా ఎదుర్కోలేకే అల్లర్లకు పాల్పడుతున్నారు .
రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు రాష్ట్ర అభివృద్ధిని, మరచి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పర్యటనలను అడ్డుకోవడమే సరిపోయింది.చంద్రబాబు,లోకేష్ సభలకు వస్తున్న ప్రజాధారణ చూస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ వణుకుతోంది.అందుకే ఎర్రగొండపాలెంలో చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఇదంతా వివేకా హత్య కేసు డైవర్ట్ చేయడానికే వైసీపీ డైవర్ట్ రాజకీయాలు చేస్తోంది.మంత్రి సురేష్ బాధ్యత మరచి వీదిరౌడీలా వ్యవహరించడం దుర్మార్గం . వైసిపి ప్రభుత్వం దళితులపై దాడులు చేసినప్పుడు మంత్రి సురేష్ ఎక్కడ ఉన్నారు.మంత్రి సురేష్ ని వెంటనే మంత్రి పదవి నుండి గవర్నర్ భర్త రఫ్ చేయాలిదాడులు జరుగుతాయని పోలీసులకు ముందే తెలిసినా పట్టించుకోలేదు , చంద్రబాబు భద్రతా సిబ్బందికి గాయాలు పోలీసుల వైఫల్యమే అంటూ మండి పడ్డారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు ఆమెతో పాటుగా నాయకులు మాధవ నాయుడు మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ మాజీ వైస్ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, త్రివేంద్ర నాయుడు, బాబుల్ రెడ్డి వాసుదేవరెడ్డి,దాదు, ఫయాజ్ సనావుళ్ళ, తదితరులు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img