విశాలాంధ్ర`ధర్మవరం : ఉమ్మడి జిల్లా అనంతపురంలో ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలో భాగంగా పర్యటించినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం చిలక మధుసూదన్ రెడ్డి సొంత గృహములో కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబ సభ్యులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడుతూ, మండల పరిధిలోని గోట్లురు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబ సభ్యులను ఆనాడు పరామర్శించి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అని తెలిపారు. ఈ క్రమంలో భాగంగా మృతుని పెద్ద కుమార్తె హలిమా ఎస్సై కావాలని ఆనాడు తెలిపింది దీంతో ఎస్సై అవ్వడానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కోచింగ్కు అయ్యే ఖర్చుతోపాటు హాస్టల్, ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వగానే ఫిజికల్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్ పరీక్షలకు మొత్తం ఖర్చులన్నీ జనసేన పార్టీ అధినేత బరిస్తానని వారు తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ కు చిలక మధుసూదన్ రెడ్డికి ఆ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, నాయకులు లింగాల ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.