Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మాతృ- శిశు మరణాలపై సమీక్ష

విశాలాంధ్ర-అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వీరబ్బాయి అధ్యక్షతన గురువారం మాతృ – శిశు మరణాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లో జరిగిన రెండు మాతృ మరణాలు, ఐదు శిశు మరణాల మీద జరిగిన సమీక్ష జరిపి సంభందిత వైద్యాధికారులు తయారు చేసిన నివేదిక లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… క్షేత్ర స్థాయిలో గర్భవతులలో సాధారణంగా కనిపించే రక్త హీనత, అధిక రక్త పోటు సమస్య ల ను త్వరగా గుర్తించి తగు సూచనలు సంభందిత వైద్యాధికారులు ఎప్పటి కప్పుడు సమాచారం అందించడం ద్వారా మాతృ, శిశు మరణాలను అరికట్టవచ్చు అన్నారు. వైద్య సిబ్బంది గర్భవతులకు మరియు బాలింత ల కు అందించే సేవల్లో ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తే మరణాలు సంభవించవన్నారు. ముఖ్యంగా సంభందిత వైద్యాధికారులు తగు సూచనలు ఎప్పటి కప్పుడు తెలపాన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచనల ప్రకారం సురక్షిత మాతృత్వం, నవజాత శిశువు సంరక్షణ మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఏ స్త్రీ జన్మనిస్తూ మరణించ కూడదు అని ఏ శిశువూ మరణించడాని కే జన్మించ కూడదు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా.యుగంధర్, ప్రోగ్రాం అధికారులు డా.సుజాత, డా.చెన్న కేశవులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు,డా.దినకర్, డా.కుముద, డి పి హెచ్ ఎన్ ఒ లు ఇందిర, వీరమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ లక్ష్మన్న, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img