Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మానవ సేవే దైవ సేవతో సమానం.. శ్రీ సత్య సాయి భజన మండలి సేవాదళ్ సభ్యులు.

విశాలాంధ్ర -ధర్మవరం : మానవసేవే దైవ సేవతో సమానమని శ్రీ సత్యసాయి భజన మండలి సేవాదళ్ సభ్యులు సాంబశివుడు, ఆచారి, నాగిరెడ్డి, సుబ్రమణ్యం, సదాశివ, లక్ష్మీనారాయణ, కాకుమాని సాగర్ లు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగులకు, సహాయకులకు పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను 210 మందికి వారు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశీస్సుల తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. దాతల సహాయ సహకారములతో ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యంగా చేయడం జరుగుతుందన్నారు.. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రభుత్వ ఆసుపత్రికి పేదలు తమ ఆరోగ్యమును కాపాడుకోవడానికి, వైద్య చికిత్సలు పొందటానికి వస్తున్నారని, ఉదయం పూట ఇలాంటి అల్పాహార కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషించేతగ్గ విషయమని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.. అనంతరం శ్రీ సత్యసాయి భజన మండలి వారికి సూపర్డెంట్ తో పాటు వైద్యులు, సిబ్బంది కృతజ్ఞతలను తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img