Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మారుమోగిన గోవింద నామస్మరణ.. ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణములోని శ్రీనివాస నగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం నిర్వహించిన వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు గోవిందనామ స్మరణ తో దేవాలయ అభివృద్ధి కమిటీ,దాతలు, భక్తాదుల నడుమ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణము, వెలుపలి భాగము అంతా కూడా విద్యుత్ దీపా అలంకరణ వివిధ పుష్పా అలంకరణను అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్చకులు రాజేష్ ఆచార్యులు, మోహన స్వామి భక్తాదుల, దాతల, కమిటీ పేరిట ప్రత్యేక పూజలను నిర్వహించారు. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా భక్తి వాతావరణం నెలకొన్నది. ఈనెల 1వ తేదీ ఆదివారము నాడు అంకురార్పణ కలశ స్థాపన తిరుమంజన సేవతో ప్రారంభమై సోమవారం రోజున మూలవిరాట్కు పంచామృతాభిషేకం విశేష అలంకరణ అర్చన గావించారు. సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలకు 516 రూపాయల నుండి మూడు లక్షల వరకు దాతలు ముందుకు రావడంతో వారి పేరిట ప్రత్యేక పూజలను చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికంగా కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చి స్వామివారిని వేలాదిమంది దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారానే భక్తాదులకు స్వామివారి దర్శనాన్ని అభివృద్ధి కమిటీ కల్పించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ జింక రాజేంద్రప్రసాద్ చెన్నం శెట్టి శ్రీనివాసులు, చెన్నం శెట్టి రమేష్ కుమార్ తోపాటు వందలాదిమంది భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img