విశాలాంధ్ర` కదిరి : ఏపిపిటిడి(ఆర్టీసి)ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రకమిటి పిలుపు మేరకు మంగళవారం ఉద్యోగులు డిపో వద్ద నిరసన చేశారు.మూడునెలలుగా ఆర్టీసి ఉద్యోగులకు పెండిరగు పెట్టిన ఓటిలు నైట్/డేఔట్ అలవెన్సులు వెంటనే చెల్లించాలి.ఓటి,నైట్,డేఔట్ అల వెన్సులు మూడునెలలు అరియర్సుతో చెల్లించాలి.ఈనెల నుండి ప్రతినెలా జీతంతో పాటే ఓటి,ఇతర అలవెన్సులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. పెండిరగు పెట్టిన జీతాలు చెల్లించాలి.కొత్త పి.ఆర్.సి నిబంధనల మేరకు సర్వీసు పూర్తిచేసిన వారికి ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీమ్ అంద చేయాలి.డిమాండ్లు పరిష్కరించాలని తదుపరి రాష్ట్రకమిటి నుండి పిలుపువస్తే కార్యక్రమం చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.