Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మా భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోండి

మా భూమిని మాకు స్వాధీన పరచండి…. గిరిజనులు
విశాలాంధ్ర -తనకల్లు : మా భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని మాకు స్వాధీనం చేయాలంటూ తబలం మండలం మొగల్ చెట్ల తండా నివాసులు బుధవారం జాతీయ రహదారిపై రాస్తారోకోతోపాటు తాసిల్దార్ మధు నాయక్ కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1988 సంవత్సరంలో 1175 1176 1179 1180 సర్వే నంబర్లలో 8 మంది ట్రావెల్స్ కి గవర్నమెంట్ దీపట్టాలు ఇవ్వడం జరిగిందని ఆ భూమిని ఉంగరాల ఇండ్లకు చెందిన వారు వారి కుటుంబీకులు కబ్జా చేసుకుని రిజిస్టర్ ఆఫీస్ నందు ఫోర్జరీ సంతకాలు చేసి మేము అమ్మినట్లు చూపి అన్ని తప్పుడు డాక్యుమెంట్లు రెడీ చేసుకున్నారని చర్యలు తీసుకోలేదన్నారు ఏపీ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశామని రెవిన్యూ అధికారులు కూడా సర్వే చేసి మా భూమిని చూపించలేకపోతున్నారని రాజకీయ నాయకుల ఒత్తిడిల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా భూమిని మాకు అప్పగించకపోతే బంజారా ప్రజాప్రస్థాన కమిటీ హ్యూమన్ రైట్స్ తరఫున పోరాటాలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బంజారా ప్రజాప్రస్థాన కమిటీ డివిజన్ అధ్యక్షుడు, హ్యూమన్ రైస్ వర్కింగ్ చైర్మన్ చంద్రశేఖర్ నాయక్ తోపాటు లక్ష్మీనారాయణ నాయక్ శంకర్ నాయక్ రాజు నాయక్ భగత్ గోపాల్ నాయక్ శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img