Friday, April 19, 2024
Friday, April 19, 2024

ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు.

అగ్నిమాపక అధికారి… యు. రాజు.
విశాలాంధ్ర -ధర్మవరం : అగ్ని ప్రమాద వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ఏడు రోజులు పాటు ఘనంగా అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు.. ఈ సందర్భంగా చివరి రోజు గురువారం మండల పరిధిలోని గోట్లురు గ్రామంలో స్థానిక ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని అగ్నిమాపక అధికారి యు. రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇంటిలో వినియోగించే గ్యాస్ వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై డెమో ద్వారా ప్రదర్శన ఇచ్చారు. తదుపరి ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా వారు తెలియజేశారు. అనంతరం కరపత్రాలను బ్రోచర్స్ ను పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదాలపై గల రకాలను గురించి తెలియజేసి నివారణ ఉపాయాలను కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శకులు శివరామిరెడ్డి, ముస్తఫా, హరినాథ్ రెడ్డి, రతచోదకులు- రవీంద్ర నాయక్, కృష్ణా నాయక్, కృష్ణమూర్తి, అగ్ని బటులు- ప్రకాష్ నాయుడు, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు,మనోహర్, హరినాథ్ రెడ్డి, బాలకృష్ణ, వీరనారాయణ, హోంగార్డ్లు -, సతీష్ కుమార్, లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img