Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మున్సిపల్‌ ఉద్యోగి మృతి పట్ల మేయర్‌ వసీం సంతాపం

విశాలాంధ్ర`అనంతపురం : నగర పాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం పరిధిలోని ఎలక్ట్రికల్‌ విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రాఘవేంద్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం శనివారం మృతుని నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మృతుని కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు.మేయర్‌ వెంట కార్పొరేటర్లు శ్రీనివాసులు,సైఫుల్లా బేగ్‌ ,మల్లికార్జున,బాబా ఫకృద్దీన్‌,వైసీపీ నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img