Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మున్సిపల్ రూములు వేలంపాట.. పురపాలక సంఘ కమిషనర్ మల్లికార్జున

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద నూతనంగా నిర్మించిన కాయగూరల మార్కెట్లో భాగంగా మొదటి అంతస్తు 51 షాపు రూములు ఈ నెల ఏడవ తేదీన పాత కూరగాయల మార్కెట్ వద్దనే వేలంపాటను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి అంతస్తు షాపు రూములు అద్దెలో 40 శాతం డిస్కౌంట్ కలదు అని తెలిపారు. మొదటి అంతస్తులు బ్లాక్-1 నుండి బ్లాక్-6 వరకు సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ లలో బ్లాక్ వన్ కు గుడ్ విల్ సొమ్ము 5 లక్షల నుండి 8 లక్షల వరకు, బ్లాక్-2 లో గుడ్ విల్ లక్షల నుండి 8.90 వరకు, బ్లాక్-4 లో గుడ్ విల్ సొమ్ము 8.80 లక్షల నుండి తొమ్మిది లక్షల వరకు, బ్లాక్బి5 లో గుడ్ విల్ సొమ్ము ఐదు లక్షల నుండి, బ్లాక్-6 లో4.2 లక్షల నుండి 4.40 లక్షల వరకు ఉంటుందన్నారు. అదేవిధంగా ఈ మార్కెట్ కు కీర్తిశేషులు కేతిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి పేరును కూడా పెట్టడం జరిగిందన్నారు. ఈ నూతన మార్కెట్లో అన్ని రకాల వసతులతో పట్టణ నడిబొడ్డున కలదు అన్నారు, 1.79 ఎకరాల విస్తీర్ణంలో నూతన కూరగాయలు మార్కెట్, అండ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగిందన్నారు. వేలం పాటలో పాల్గొనేవారు ఒక లక్ష సాల్వెంట్స్ సర్టిఫికెట్ కలిగి ఉండి, లక్ష రూపాయలు డీడీ లేదా నగదు రూపంలో డిపాజిట్ ముందుగానే చెల్లించవలెనని తెలిపారు. ఈ అవకాశాన్ని వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img