Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మున్సిపల్ సహాయ కమిషనర్ గా మధుసూదన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయ సహాయ కమిషనర్ గా కె.వి. మధుసూదన్ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. వీరు నందికొట్కూరు కమిషనర్ గా ఉంటూ, బదిలీగా ధర్మవరం కు రావడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పురపాలక సంఘ అభివృద్ధికి తన వంతుగా తాను కృషి చేస్తానని, వాడు ప్రజల సమస్యల పరిష్కారానికై బాధ్యతగా ఉంటానని తెలిపారు. పురపాలక సంఘమునకు ఆస్తి పన్ను, నీటి పన్నులు సకాలంలో పట్టణ ప్రజలు చెల్లించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. తదుపరి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మేనేజర్ ఆనంద్, కార్యాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img