Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటాం…

వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసుల రెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం : నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం పోట్ల మరి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాద సంఘటనలో ఆరు మంది మృతి చెందిన సంఘటన చాలా బాధాకరమని, ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని వైఎస్ఆర్సిపి శ్రీ సత్య సాయి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలకు గుర్రం శ్రీనివాస్ రెడ్డి తో పాటు మాజీ వైస్ చైర్మన్ చందమూరి నారాయణరెడ్డిలు దగ్గరుండి సవ పరీక్ష చేయించి, మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రమాద ఘటన సమాచారాన్ని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కు తెలియజేయడం జరిగిందని, తదుపరి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు తెలుపగా ఒక్కొక్క బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున 30 లక్షల రూపాయలను ఎక్స్ప్రెస్ కింద వారు ప్రకటించడం జరిగిందన్నారు. త్వరలోనే ఎక్స్ప్రెస్ ఆ డబ్బులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సమక్షంలో అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ, ట్రాఫిక్ నియమ, నిబంధనలను పాటించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మృతి చెందిన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img