Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మృతుని కుటుంబాలకు చిలకం మధుసూదన్ రెడ్డి నగదు అందవేత

విశాలాంధ్ర-ధర్మవరం : నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం పో ట్లమర్రి గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మంది కూలీలు మృతి చెందడం జరిగింది. సమాచారాన్ని అందుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కూడా వారు పలకరించారు. తదుపరి ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఈశ్వరయ్యకు, ఫయాజ్కు, అశ్విర్ కు, నర్సిములు కు, మల్లేష్ కు, నారాయణస్వామి లకు నగదును అందజేశారు. జనసేన పార్టీ తరఫున ఈ నగదును అందజేయడం జరిగిందని ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ అండదండలుగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img