Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మౌలిక సదుపాయాలు ఉండేలా చూడండి.. ఆర్డీవో తిప్పే నాయక్

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రతిరోజు మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని ఆర్డిఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్, ఎస్పీసీఎస్ బాలుర ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షా కేంద్రాలను వారు ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం పరీక్ష గదులలో అన్ని సదుపాయాలు ఉన్నాయా? లేవా? ముఖ్యంగా తాగునీరు విద్యార్థులకు అందుబాటులో ఉందా? లేదా? అన్న వాటిని వారు నేరుగా పరిశీలించా రు. పరీక్షా గదులలో వెలుతురు, ఫ్యానులను కూడా వారు పరిశీలించారు. పరీక్ష గదులలో ఎవరు కూడా సెల్ఫోన్ వాడరాదని, కలెక్టర్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. అనంతరం వైద్య విభాగం కిట్టులను కూడా వారు పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించే విధంగా సూపర్డెంట్లు తగిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. విద్యార్థుల హాజరు ఎప్పటికప్పుడు ఉన్నత కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img