విశాలాంధ్ర`బ్రహ్మసముద్రం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం, శనివారం కళ్యాణదుర్గం బ్యాంక్ ఆవరణంలో ఖాతాదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 25 26 తేదీలలో యూనియన్ అన్ని శాఖలలోనూ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా పట్టణంలో నిర్వహించామని మేనేజర్ శ్రీనివాస్ రావు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరమోహన్ సాహు ,సింహాచలం, మేనేజర్ శ్రీనివాసరావు హాజరై వారు మాట్లాడుతూ నూతనంగా యూనియన్ ముస్కాన్ పథకం ప్రారంభించామని ఇది పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వీటితోపాటు వాహన రుణాలు గోడ రుణాలు అతి తక్కువ వడ్డీరేట్లకే యూనియన్ బ్యాంక్ అందుబాటులో ఉంచిందని ఖాతాదారులు యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది లోకేష్, భాష తదితరులు పాల్గొన్నారు.