Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే

విశాలాంధ్ర- పెనుకొండ : ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర నారాయణ శనివారం జరిగిన రంజాన్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. పట్టణం ఈద్గా మైదానం వద్ద జరిగిన ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ముస్లిం సోదరులు ఆయనకు టోపీ, శాలువ కప్పి సత్కరించారు. ఈద్ నమాజ్ అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు, ఆయన సందర్భంగా ముస్లింల ఉద్దేశించి మాట్లాడుతూ నెల రోజులపాటు ముస్లింలు కటోర ఉపవాస దీక్షతో ప్రార్థనలు చేసి అందరూ బాగుండాలి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని పండుగ వాతావరణం లో అందరూ తమకు తోచిన సహాయం చేస్తూ దానాలు చేస్తూ పేదవారికి పంచుతూ తమ యొక్క దాతృత్వాన్ని చూపిస్తారని అల్లా వారిపట్ల కరుణిస్తారని కావున ముస్లింలు తమ సంపాదించిన సంపాదనలో కొంత మొత్తం పేద ప్రజల కోసం పంచిపెట్టడం మంచి ఆలోచన పరంగా అందరూ బాగుండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తారు నేటితో రంజాన్ పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని అందరూ బాగుండాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img