Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రక్షకుని శిలువబాట.. మానవాళికి ముక్తిబాట.. చర్చి పాస్టర్ డానియల్

విశాలాంధ్ర -ధర్మవరం : కరక్షకుని సిలువబాట.. మానవాళికి ముక్తిబాట అని చర్చి పాస్టర్ డానియల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల ఎస్ ఐ యు చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం క్రైస్తవ సోదరులందరూ చర్చిలో అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైబిల్ గ్రంథంలోని ముఖ్యమైన ఘట్టములను పాస్టర్ చదివి వినిపించారు. మానవతా సేవతో పాటు సమాజానికి కూడా సేవ చేస్తూ తోటి వారిని ప్రేమించాలని తెలిపారు. కష్టంలో ఉన్న వ్యక్తిని కాపాడుటలో తమ వంతు సహకారములు అందించాలని తెలిపారు. ఏసుప్రభు మరణించక ముందు పలికిన ఏడు మాటలను శుభశుక్రవారంన ప్రపంచవ్యాప్తంగా ధ్యానిస్తారని తెలిపారు మొదటగా తనను శిలువ వేసే వారిని చూసి శాంతమూర్తిడఁ తండ్రి! వీరేమి చేయుచున్నారు గనుక వీరిని క్షమించుముఁ అంటూ ప్రార్థిస్తాడని, శత్రువులను సైతం ప్రేమించాలని బోధించిన యేసు చంపేవారిని క్షమించాడని తెలిపారు. సిలువ సమీపంలో ఉండి కన్నీరు మున్నీరవుతున్న తన తల్లి మరియాను చూసి ఓదార్పును ఇచ్చాడని తెలిపారు. లోక రక్షణకు పాప పరిహాఅర్థం తన కుమారుడిని బలి అర్పణగా చేశారని తెలిపారు. ప్రేమ, త్యాగం, కరుణ మానవజాతికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి పర్యవేక్షకులు సుకుమార్తో పాటు అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరీ, సోదరీమణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img