Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి.. చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్యదర్శి లింగమయ్య.


విశాలాంధ్ర /ధర్మవరం: ఆంధ్ర ప్రదేశ్ లోని రజకులను ఎస్సీ జాబితాలో ప్రభుత్వం చేర్చాలని చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్యదర్శి సి. లింగమయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ గత దశాబ్దాలుగా రజకులు బిసి ఏ లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని, చాలీచాలని ఆదాయంతో దుర్భర జీవితాలు గడుపుతూ కాలం వెళ్ళదిస్తున్నారని తెలిపారు. రజకుల జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి లేక ఎదుగుబోలే ణి జీవితాన్ని గడుపుతూ, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో అగ్రకుల చేతల్లో ఎన్నో అవమానాలు కూడా భరిస్తూ ఉన్నారని తెలిపారు. కావున ఇప్పటికైనా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు నాగప్ప, గుడ్లూరు రామకృష్ణ, గంగాధర, రాధాకృష్ణ, నరసింహులు, రామంజి, ముత్యాలమ్మ ,మంజుల, బయన్న, రాము, రామయ్య, రామాంజనేయులు, నాగేంద్ర, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img