Friday, April 19, 2024
Friday, April 19, 2024

రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా అధికారి

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మండలం బు ధగవి గ్రామంలో శనివారం జరిగే రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామాంజనేయులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమిని పురస్కరించుకొని సూర్యనారాయణ స్వామి దర్శనానికి దాదాపు 20,వేలు మంది పైబడి భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నామని దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు క్యూలైన్లు, తాగునీరు అన్నదాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయంలో జరిగే కళ్యాణోత్సవం మరియు హోమాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సూర్యనారాయణ స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణయ్య, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రామ తులసి, ఉండబండ దేవాలయ ఈవో రమేష్ బాబు, తాడిపత్రి ఈవో సుబ్రహ్మణ్యం, రథసప్తమి ఏర్పాట్లు నిర్వాహకులు నరసింహులు, ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img