విశాలాంధ్ర`ధర్మవరం : రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాన్ని నిర్మూలించాలని రాష్ట్రవ్యాప్తంగా పెండిరగ్లో ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐ వైఫ్ జిల్లా అధ్యక్షుడు రాజా, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పోతులయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోనికి రాకమురుపు ఒక్కసారి అవకాశం ఇవ్వండి… అన్న మాటతో రాష్ట్రంలోనే నిరుద్యోగము లేకుండా చేస్తామన్న మాటలు ఏమయ్యాయి? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ కాస్త డు ప్ క్యాలెండర్ గా మార్చి, అరకో రా ఉద్యోగాలు ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నిరుద్యోగులకు ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కోల్పోయే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు విడుదల విషయంలో విఫలం చెందడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుద్యోగుల గోడు పట్టించుకుని చదివిన చదువుకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన విద్యార్థి, నిరుద్యోగులు, రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల పార్టీలు అన్నింటిని చైతన్యవంతం చేసి, మీ యొక్క క్యాంపస్లను ముట్టడిరచడానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కిషోర్, వినయ్, రాము, నవీన్, ఉపేంద్ర, రాజీవ్, అశోక్, కృష్ణ, నందా, రమేష్, సాయికుమార్, కిరణ్, ప్రవీణ్, విజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.