Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రాష్ట్రస్థాయి చెస్‌ టోర్నమెంట్‌ పోటీలు.. ఎస్‌జిఎఫ్‌.. కార్యదర్శి ఎస్‌. రవికుమార్‌

విశాలాంధ్ర`ధర్మవరం : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అనంతపురం అండ్‌ శ్రీ సత్య సాయి జిల్లాల ఆధ్వర్యంలో చెస్‌ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌ పోటీలను పట్టణంలోని కళాజ్యోతిలో ఈనెల 12న నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా ఎస్జీఎఫ్‌..కార్యదర్శి ఎస్‌. రవికుమార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలో అండర్‌- 14, అండర్‌ -17 విభాగాలలో బాలురు, బాలికలు కు ఈ చెస్‌ టోర్నమెంట్లు, రాష్ట్రస్థాయి ఎంపికలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్‌- 14 బాల, బాలికలకు, అండర్‌- 17 బాల, బాలికలకు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి పాఠశాల నుండి ఒక్కో ఏజ్‌ గ్రూపుకు ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలికలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఈ చెస్‌ పోటీలలో పాల్గొనేవారు ఎస్జీఎఫ్‌ ఎంట్రీ ఫారం, చెస్‌ ఎంట్రీ ఫార్మును పూర్తి చేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు బి. శివకృష్ణ సెల్‌ నెంబర్‌ 9177032075 కు సంప్రదించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img