Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌ టెన్నిస్‌ క్రీడా పోటీలకు విన్సెంట్‌ ది పాల్‌ విద్యార్థులు

విశాలాంధ్ర-రాప్తాడు : ఈనెల 10వ తేదీన అనంతపురం రూరల్‌ మండలం రుద్రంపేటలో జరిగిన సాఫ్ట్‌ టెన్నిస్‌ క్రీడాపోటీల్లో రాప్తాడు మండలం విన్సెంట్‌ ది పాల్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. అండర్‌-14 విభాగంలో చేతన, శ్రీలేఖ, ప్రియ, జ్ఞానేశ్వరి, జశ్వంత్‌, అండర్‌-17 విభాగంలో సాయిసింధూజ ఎంపికయ్యారని హెచ్‌ఎం సిస్టర్‌ అమలు గురువారం తెలిపారు. ఈ జిల్లా జట్టు ఈనెల 17వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. ఎంపికైన విద్యార్థినులను పాఠశాల కరస్పాండెంట్‌ సిస్టర్‌ జెసింత, సుపీరియర్‌ సిస్టర్‌ జ్ఞానమ్మ, హెచ్‌ఎం సిస్టర్‌ అమల, పీడీ నారాయణరెడ్డి, పీఈటీ సుధాకర్‌ రెడ్డి ఉపాధ్యాయులు, అభినందించారు. సిస్టర్‌ అమల పిల్లలను మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించి భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img