Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థి ఎంపిక.

విశాలాంధ్ర -ధర్మవరం : గత నెల 30న పాల్తూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో పట్టణంలోని జీవనజ్యోతి స్కూల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని జి. సాయి భవిత ఉత్తమ ప్రతిభను ఘనపరచడంతో అండర్ 14 రాష్ట్రస్థాయి హాకీజెటకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం. సిస్టర్ ఝాన్సీయా తెలిపారు. ఈ సందర్భంగా ఝాన్సియా మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడల్లో కూడా మంచి నైపుణ్యమును ప్రదర్శించడం జరుగుతుందన్నారు. చదువు, క్రీడలను సమానంగా విద్యార్థులు చూడాలని తెలియజేశారు. అనంతరం హెచ్ఎం తో పాటు పిఈటి, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తోటి విద్యార్థులు ఆ విద్యార్థిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img