Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రైలు పట్టాలు దాటుతుండగా చేనేత కార్మికుడు మృతి

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణములోని కేతిరెడ్డి కాలనీకి చెందిన పామాల నారాయణస్వామి(47) అనే చేనేత కార్మికుడు ఆదివారం రాత్రి మరుగుదొడ్డికి వెళ్లే సమయంలో రైలు పట్టాలు దాటే సమయంలో ఓ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హిందూపురం జిఆర్పి.. ఎస్సై బాలాజీ నాయక్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్. ఎర్రి స్వామి, కానిస్టేబుల్ కృష్ణ సంఘటనా స్థలానికి సోమవారం ఉదయం చేరుకున్నారు. రైలు పట్టాల పక్కన చెంబు కూడా ఉండడంతో, చుట్టుపక్కన ఉన్న కాలనీవాసులు గుర్తుపట్టారు. తదుపరి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి, సవ పరీక్ష అనంతరం, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. హిందూపురం జిఆర్పి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనుకోని విధంగా ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరగడం కుటుంబంలో విషాదఛాయలు చాటుకున్నాయి. మృతునికి భార్య లక్ష్మీదేవి, ఐదు సంవత్సరాల పునీత్ అను కుమారుడు కూడా కలడు.ప్రభుత్వమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు, బంధుమిత్రులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img