పెనుకొండ నందు వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 117వ కళ్యాణబ్రహ్మ రథోత్సవం శనివారం రోజు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు నిత్యారాధన, నిత్య హోమ బలి, మహా మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగములతో పాటు గా ఆలయ ధర్మకర్తలు అయిన వెచ్చం అమర్నాథ్ వారి కుటుంబ సభ్యులు సుమన్, డాక్టర్ రత్నాకర్, డాక్టర్ పవన్ కుమార్, పర్యవేక్షణలో స్వామివారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా భోగసముద్రం చెరువు నందు స్వామివారికి చక్రస్నానము చేయించారు దేవాలయము నుంచి భోగసముద్రం చెరువు వరకు స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి చక్రస్నానంతో పూజలు నిర్వహించి మరల స్వామివారిని గుడికి చేర్చారు ఈ కార్యక్రమంలో యాడికి నాగరాజు, సుధాకర్ గుప్తా, కన్నా స్వామి, ప్రగతి శ్రీనివాసులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.