Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లేపాక్షి లో జరుగు సిపిఐ శిక్షణా తరగతులను విజయవంతం చేద్దాం

విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ పట్టణం నందు మంగళవారం సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీ రాముల నేతృత్వంలో కరపత్రాలను విడుదల చేయడమే జరిగినది ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు మే నెల 13 14 15 ప్రపంచ ఖ్యాతి ప్రఖ్యాతిగాంచిన లేపాక్షిలో జరుగును శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుంచి సిపిఐ పార్టీ శ్రేణులు కార్యకర్తలు హాజరవుతారు దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ అలనాటి బ్రిటిష్ ప్రభుత్వము యొక్క దుర్మార్గాలను వ్యతిరేకంగా పోరాడి దున్నేవాడిదే భూమి అనే విధానంతో భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం పోరాడినటువంటి పార్టీ సిపిఐ వార్డు కమ్యూనిస్టు పార్టీ పేదల కోసం బడుగు బలహీన వర్గాల వారి కోసం సిద్ధాంతానికి కట్టుబడి సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజల యొక్క మన్నన పొందినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఇలాంటి పార్టీ లేపాక్షిలో శిక్షణ తరగతులు జరుపుకోవడం చాలా గొప్ప విషయం ఈ శిక్షణ తరగతులలో రాజకీయంగా కార్యకర్తలను ఎదిగించాలని ఉద్దేశంతో జిల్లా పార్టీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా యూపీఏ ప్రభుత్వాన్ని మెడలు వంచి యూపీఏ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి 2007లో గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది అనేక పోరాటాలు ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజల పక్షాన నిలబడినటువంటిది కమ్యూనిస్టు పార్టీ ముందుకు వెళ్లడం శుభపరిణామం అని ఈ కార్యక్రమంలో ఏఐటీయూ డివిజన్ కార్యదర్శి కిష్టప్ప భవన కార్మిక సంఘం నాయకులు మల్లికార్జున వెంకటరాముడు జాఫర్ వలి పాల్గొనడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img