ప్రిన్సిపాల్ – అశ్రాఫ్ఆలీ
విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ మండలంలోని చిన్న ముష్టురు గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆఫీస్ ఆటోమేషన్ మరియు ల్యాండ్ సర్వేయింగ్ కోర్సులు కోసం దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ అశ్రాఫ్ ఆలీ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదవ తరగతి ఉత్తీర్ణత అయిన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల తొమ్మిదవ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు ఈ కోర్సులకు ఎంపికైన వారికి కళాశాలలో నాలుగు నెలల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అయితే 6 వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు కోర్సులు పూర్తి చేసుకున్న వారికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ శిక్షణ కార్యాలయం వారు పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందని ఇందులో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కోర్సును పూర్తి చేసుకున్న వారికి ఉపాధి,ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కోర్సులకు ఎంపికైన వారికి జనవరి 17 నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సు కు సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉంటే కళాశాలలోని ఆఫీస్ ఆటోమేషన్ కోఆర్డినేటర్ జి. సురేష్, ల్యాండ్ సర్వేయింగ్ కోఆర్డినేటర్ పి. రామానాయుడులను సంప్రదించాలన్నారు.