Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వంకలలో ఇచ్చిన పట్టాలను రద్దు చేయండి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ నందు 17వ వార్డులో నారాయణమ్మ కాలనీకి పడమర వైపున్న వంక లో ఇటీవల ఇద్దరికీ ఇంటి పట్టాలు ఇవ్వడంతో వారు వంకను పూడ్చివేసి ఇల్లు నిర్మిస్తున్నారని ఇల్లు నిర్మిస్తే వర్షపు నీరు మురుగునీరు వచ్చి కాలనీలో చాలా ఇబ్బంది కలుగుతుందని కాలనీవాసులు గురువారం తాసిల్దార్ సువర్ణకు వినతి పత్రాన్ని అందజేశారు , కొంతమంది నాయకులు వంకలపై కన్నేసి ప్రభుత్వ భూమిని పట్టాలుగా మార్చుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారని నగర పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన చేసి ఇంటి పట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు అలాగే వారు స్థానిక శాసనసభ్యులు మాల గుండ్ల శంకర్ నారాయణ కలసి సమస్యను తెలియజేశారు వంకలలో డి పట్టాలు ఇచ్చారని వారు ఇల్లు నిర్మిస్తే కాలనీవాసులకు ఇబ్బంది కలుగుతుందని తమ యొక్క సమస్యను తెలియజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ వాటి పరిష్కారానికి అధికారులను పంపుతాము సమస్య లేకుండా పరిష్కారం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img