Friday, April 19, 2024
Friday, April 19, 2024

వర్షాలు తగ్గే వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించండి

ఎన్‌ ఎస్‌ యుఐ రాష్ట్ర నాయకులు రేగాటి శివకృష్ణ
విశాలాంధ్ర`ఉరవకొండ : గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులుకు గురవుతున్నారని వర్షాలు పూర్తిస్థాయిలో తగ్గేవరకు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఎన్‌ఎస్‌ యు ఐ రాష్ట్ర నాయకులు రేగాటి శివకృష్ణ తెలిపారు. సోమవారం ఉరవకొండలోని విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల వర్షంలోనే తడుస్తూ పాఠశాలలకు వెళుతున్నారని ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు గురవుతున్నారని విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురై అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం దీనిపై స్పందించి పాఠశాలలకు సెలవులు ప్రకటించారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img