Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వికలాంగునికి ఆర్థిక సహాయాన్ని అందించిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ

విశాలాంధ్ర -ధర్మవరం : నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం సంగాల తండాకి చెందిన జింకల నారప్ప కుమారుడు నాగరాజు మృతి చెందడంతో జింకల నారప్ప రెండు కాళ్లు లేని వికలాంగుడు అన్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సమాచారాన్ని అందుకొని శనివారం తన వ్యక్తిగత కార్యాలయంలో జింకల నారప్ప కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం కింద 20 వేల రూపాయలను అందజేశారు. అనంతరం గోనుగుంట్ల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img