Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ మండలం నేరమెట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న 33 మంది విద్యార్థులకు గ్రామ సర్పంచ్‌ యోగేంద్ర రెడ్డి బుధవారం పాఠశాలలో ట్యాబులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని అందులో ప్రధానంగా విద్యార్థులకు ట్యాబులను అందించి డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. సమాజంలో ఉన్న అంతరాలను తొలగించడానికి ప్రతి విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దన్న, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img