Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యార్థులకు పుస్తకాలపై అవగాహన

విశాలాంధ్ర-తాడిపత్రి : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ఉన్న శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి రవికుమార్‌ నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలపై అవగాహన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసాము. చినిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో, ఒక మంచి మాటతో పుస్తకం విలువను, ఆవశ్యక తను, పుస్తకము ఒక మంచి నేస్తం అని పుస్తకాలను చదివే అలవాటు చిన్నప్పటినుంచే అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులు, గ్రంథాలయ పాఠకులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img