విశాలాంధ్ర` ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు పాఠశాలలోని సుమారు 500 మంది విద్యార్థులకు వారి బరువు ఎత్తు రక్తంలోని హెచ్ బి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు నిమ్మల వెంకటేష్ అర్చన హెచ్ఎం యు వీరన్న తదితరులు పాల్గొన్నారు.