Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యా సంక్షేమ సంఘం కు కృషి చేస్తాం.. కురుబ ఉపాధ్యాయ సంఘం నాయకులు

విశాలాంధ్ర- ధర్మవరం : కురుబ విద్య సంక్షేమ సంఘమునకు మరింత కృషి చేస్తామని కురుబ ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు గవ్వల గోవిందు, అధ్యక్షులు ఈశ్వరయ్య,కార్యదర్శి బాలకొండ చంద్రమోహన్‌ ను పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని పోతుకుంట రోడ్డు- గిర్రాజు కాలనీలో గల భాగ్యలక్ష్మి సిల్క్‌ కేంద్ర అధినేత గోశే రాధాకృష్ణ కార్యాలయంలో కనకదాస ఉపాధ్యాయ విద్యా సంక్షేమ సంఘం 2023 సంవత్సరపు క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్‌ కు అయిన ఖర్చును, గోశే రాధా కృష్ణ వ్యవహరించడం వల్ల ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి, సంఘం తరఫున వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం గోశే రాధాకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో భక్త కనకదాస విగ్రహము ఏర్పాటుకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని, కురుబ కులస్తులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే, విగ్రహ ఏర్పాటు త్వరలోనే చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలయ్య, వెంకట రాముడు ,రమేష్‌ ,ఓబులేష్‌, రామాంజి నాగభూషణ మల్లికార్జున, చంద్రశేఖర్‌, రామకృష్ణ, జయరాం, నాగేంద్ర, వేణుగోపాల్‌, బి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img