Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్యుత్ కోతలు.. పెంచిన చార్జీలకు నిరసనగా టిడిపి ఆందోళన

విశాలాంధ్ర – ఉరవకొండ : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆదేశాలు తొ మంగళవారం ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ నాయకులు అప్రకటిత విద్యుత్ కోతలు మరియు పెంచిన చార్జీలకు నిరసనగా స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో విపరీతంగా విద్యుత్ చార్జీలను పెంచారని దీనికి తోడు ఎండాకాలంలో అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని పేర్కొన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చార్జీలు పెంచకుండా 24 గంటలు పాటు కూడా విద్యుత్ సరఫరా అందించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని వారి పేర్కొన్నారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img