Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వేలంపాట వాయిదా.. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని నూతన కాయగూరల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ లోని అప్ స్టైర్స్ లో గల 51 గదులకు వేలంపాటను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తో పాటు ఇతర అధికారులు మంగళవారం ప్రారంభించారు. ఈ వేలంపాటకు దాదాపు 20 మంది దాకా వ్యాపారస్తులు హాజరైనారు. ఈ 50 యొక్క గదులకు గుడ్ విల్ 5 లక్షల నుండి 8 లక్షల వరకు మున్సిపల్ వారు నిర్ణయించారు. అదేవిధంగా బాడుగలో 40 శాతాన్ని రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మాట మేరకు కమిషనర్ బహిరంగ వేలం పాట ప్రారంభించగా, వ్యాపారస్తులు తమ విన్నపాన్ని విన్నవించుకున్నారు. బాడుగలో 40 శాతం తగ్గించే విధంగా కూడా గుడ్ విల్ లో కూడా తగ్గించాలని వారు కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేడపైన వ్యాపారాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని, గుడ్ విల్ కు బాడిగకు తగ్గించాలని వారు తెలిపారు. దీంతో మున్సిపల్ కమిషనర్ వేలంపాటను వాయిదా వేసి, తిరిగి ఎప్పుడు వేలంపాట ఉంటుందన్న విషయాన్ని పేపర్ ప్రకటన ద్వారా తెలియజేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమములో మేనేజర్ ఆనంద్ తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img