Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల. వైస్ ప్రిన్సిపల్ అరుణ జ్యోతి

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలం లోని విద్యార్థులు గ్రంథాలయం వారు ఏర్పాటు చేసే  వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అరుణ జ్యోతి అన్నారు. సోమవారం స్థానిక గ్రంధాల భవనంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు  క్రీడలతో పాటు వేసవి విజ్ఞాన శిబిరంలో  పాల్గొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ శిబిరం ద్వారా విద్యార్థులలోని ప్రతిభను పైకి తీసుకురాగల మని తెలిపారు. ఈ శిబిరము మే 8 నుండి జూన్ 11 వ తేదీ వరకు నిర్వహించబడుతుందని, పెద్దలు చెప్పే కథలు ద్వారా కథలు వినుట, పుస్తకపఠనం, పుస్తక సమీక్ష, పెద్దల ద్వారా కథల వినుట, చెప్పుట, చిత్రలేఖనం పేపర్ ఆర్ట్స్ మొదలైన సృజనాత్మక కార్యక్రమాలు ప్రతి రోజు  నిర్వహించబడుతున్నాయిని తెలిపారు.కావున  తల్లిదండ్రులు విద్యార్థులును ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ప్రతాప్ రెడ్డి తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img