Friday, April 19, 2024
Friday, April 19, 2024

వేసవి విజ్ఞాన శిబిరాలు సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పౌర గ్రంథాలయ శాఖ వారి ఆధ్వర్యంలో శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం జరుగుచున్నవి. శాఖాగ్రంథాలయంలో నిర్వహించబడే వేసవి విజ్ఞాన శిబిరాలలో పాల్గొని గ్రంథాలయంలో గల కథల పుస్తకాలు మహానుభావుల జీవిత చరిత్రలు , సైన్స్ , క్విజ్ పురాణాలు , చరిత్ర వంటి అనేక రకములైన పుస్తకలాను చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా తెలుపుతున్నామని . ఈ వేసవి సెలవుల నందు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు 6 నుండి 10 వ తరగతి వరకు గల విద్యార్థినీ విద్యార్థులు అందరూ ఈ వేసవి విజ్ఞాన శిబిరాలలో పాల్గొని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొనా వలసిందిగా కోరడమైనది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని గ్రంథాలయానికి పంపవలసిందిగా కోరడమైనది . ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి మహబూబ్ భాష ఉపాధ్యాయులు వెంకటరమణ నరసింహులు పాఠకులు పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img