Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

విశాలాంధ్ర-ఉరవకొండ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలను కూడా ప్రత్యేకంగా అలంకరించారు ఉరవకొండ పట్టణంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి దర్శించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో విజయ్‌ కుమార్‌, భక్తులు వైఎస్‌ఆర్సిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img