విశాలాంధ్ర` ఉరవకొండ : ఆల్ ఇండియా ఎయిమ్స్ సంస్థ నిర్వహించిన ఇనిస్ట్యూట్ నేషనల్ ఇంపార్టెన్స్ కామన్స్ ఎంట్రెన్స్ టెస్ట్ లో పల్మోనాలజిస్ట్ ( శ్వాసకోస వైద్యుడు) లో ఉరవకొండ పట్టణానికి చెందిన ఎల్ఐసి సంస్థలో పనిచేస్తున్న జి. గోవిందు కుమారుడు జి. రామకృష్ణ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ సూపర్ స్పెషాలిటీ ర్యాంకును సాధించారు. పీడియాట్రిక్స్ లో ఎండిగా పనిచేస్తున్న ఆయన నవంబర్ 6న రాజస్థాన్లోనే జో దుపూర్ లో నిర్వహించిన ఇనిస్ట్యూట్ నేషనల్ ఇంపార్టెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ర్యాంకు సాధించారు. పల్మోనాలజిస్టులో సూపర్ స్పెషలిస్ట్ ర్యాంకు రావడం పట్ల రామకృష్ణను పలువురు అభినందించారు.