Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షునిగా నరసింహయ్య ఎన్నిక

విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని వైయస్సార్‌ సర్కిల్లో ఉన్న వైయస్‌ శేఖర్‌ రెడ్డి విగ్రహానికి నూతనంగా ఎన్నికైన వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య గురువారము రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైయస్‌ఆర్‌సీపీ అధినాయకత్వం తమపై ఎంతో నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ రాబోవు ఎన్నికలలో ఉమ్మడి అనంతపురం జిల్లా అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు అత్యధిక మెజార్టీతో గెలవడానికి కృషి చేస్తానన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్సిపి అసెంబ్లీ, ఎంపీ అన్ని స్థానాలను అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్సిపి నాయకులు కురవ రామ్‌ శేఖర్‌ కౌన్సిలర్‌ రంగనాథ, రాజగోపాల్‌ తిరుపాలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img