విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని 25 వార్డులో నివసిస్తున్న ఎరుకుల శ్రీకాంత్ గత ఏడాది యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడంతో ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి చలవతో ఎరుకల శ్రీకాంత్ కుటుంబానికి వైయస్సార్ బీమా పథకం కింద బుధవారం తన క్యాంపు కార్యాలయంలో 5 లక్షల రూపాయలు నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. అదేవిధంగా ఎటువంటి సమస్య వచ్చినా అండగా ఉంటారని బరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ బాబు, నూర్ నిజం తదితరులు పాల్గొన్నారు.