Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వైయస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు గొల్ల కిష్టప్ప ఆకస్మిక మృతి

విశాలాంధ్ర`అనంతపురం : శెట్టూరు మండల కేంద్రం యాదవపురంకు చెందిన గొల్ల కిష్టప్ప శుక్రవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందినట్టు అతని సోదరుడు మాజీ సర్పంచ్‌ వీరభద్ర తెలిపారు.జగన్‌ మోహన్‌ రెడ్డి గారు కాంగ్రెస్‌ పార్టీని వీడినప్పుడు శెట్టూరు మండల కేంద్రంలో జగన్‌ గారి వెంట నడిచిన నాయకులలో గొల్ల కిష్టప్ప ముఖ్యడు. వైయస్సార్‌ సీపీ నాయకులు మాజీ ఎంపిటిసి మహాబలి, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు దొడ్లో తిప్పేస్వామి, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి యం.యస్‌. రాయుడు మాజీ సింగిల్‌ విండో డైరెక్టర్‌ వీరాంజీనేయులు, సీనియర్‌ నాయకులు బోయ రంగనాథ్‌, ఎస్సీ సెల్‌ కార్యదర్శి లింగప్ప,పడసాలి సిద్దు గొల్ల గోపికృష్ణ, తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి,పూలమాలలు వేసి నివాళులర్పించారు,ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img