Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైవిఆర్ క్యాంటీన్లో 6 రూపాయల భోజనం…

ఆరు నెలలుగా కొనసాగుతున్న వైవిఆర్ భోజనం…

విశాలాంధ్ర -గుంతకల్లు : కరోనా సమయంలో అనేక మందికి అనేక రకాలుగా సేవలందించిన ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన వైవిఆర్ క్యాంటీన్లో ఆరు రూపాయలకే భోజనాలు ప్రజలకు అందిస్తూ నేటికీ ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం తన కుమార్తె నైరుతి రెడ్డి పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ఆమె చేతుల మీదగా వడ్డిస్తూ ఆకలి తీరుస్తున్నారు ఆరు రూపాయలకే కడుపునిండా భోజనం తినేతంగా వడ్డిస్తున్నారన్నారు. గుంతకల్లు నియోజకవర్గం లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి అనేక సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ప్రజా ఆదరణ పొందుతున్నారు.తన సొంత ఖర్చులతో నీటి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసి ప్రజలకు ఉచితంగా నీటి సౌకర్యం కల్పించారు. ఎటువంటి సమస్య అయినా నైరుతి రెడ్డిని కలిస్తే వారి కష్టాలు తన వంతుగా సహాయం అందిస్తూ ప్రజల మనలను పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో జయరాం రెడ్డి, గోవింద నాయక్ ,జమీల్ ,సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img